Home Cinema Shriya Reddy: ప్రభాస్ సాలార్ చిత్రం ముందు కే.జీ.ఎఫ్ కూడా బేకార్ – స్టార్ హీరోయిన్...

Shriya Reddy: ప్రభాస్ సాలార్ చిత్రం ముందు కే.జీ.ఎఫ్ కూడా బేకార్ – స్టార్ హీరోయిన్ కామెంట్స్..

Shriya Reddy: ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సలార్ పై దేశ వ్యాప్తంగా ఇటు ప్రభాస్ అభిమానులతో పాటుగా అటు సినీ ప్రేక్షకుల్లో సైతం అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కే.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ వీళ్లిద్దరూ కలిసి చేయబోతున్న తదుపరి ప్రాజెక్టు ఈ చిత్రం. ఇక త్వరలో మనందరి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నది. కే జి ఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నటువంటి చిత్రం కావడంతో అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.

shriya-reddy-comments-on-prabhas-salar-movie

ఇప్పటికే ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్ విడుదలై సినీ ప్రేక్షకుల మదిలో భారీ అంచనాలను ఏర్పరిచింది. దాంతో ప్రముఖ స్టార్ హీరోయిన్ శ్రియా రెడ్డి (Shriya Reddy) ఈ నేపథ్యంలో కే జి ఎఫ్ చిత్రాన్ని అధిగమించేలా సాలార్ ఉండబోతుందని వెల్లడించారు. పొగరు చిత్రంతో విలన్ గా తన దైన శైలిలో నటించి ముద్ర వేసుకున్న శ్రియా రెడ్డి ప్రభాస్ నటిస్తున్న సలార్ చిత్రంలో కూడా ఓ కీలక పాత్రలో నటించబోతుందట.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తను పాన్ ఇండియా లెవెల్లో విడుదల బాబోతున్న సాలార్ చిత్రం గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

See also  Venu Madhav: వేణు మాధవ్ మరణం గురించి సంచలన విషయాలు చెప్పిన తల్లి - 20 కోట్లు ఉన్నప్పటికీ...!!

shriya-reddy-comments-on-prabhas-salar-movie

సలార్ చిత్రం కే జీ ఎఫ్ చిత్రాన్ని అదిగమించి దాని కంటే మరింత ఆసక్తికరంగా రసవత్తరంగా మారనుందని ఆమె తెలిపింది. ఇప్పటి వరకు ఇలాంటి స్క్రిప్ట్ మరియు యాక్షన్ మరెక్కడా చూడలేదని ఆమె అన్నారు. కే జి ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ గేమ్ ఆఫ్ త్రోన్స్ లాంటి ప్రచండమైన ప్రపంచాన్ని సృష్టించాడు. అందులో ప్రభాస్ అద్భుతంగా ఉన్నారని ఆమె తెలియజేశారు. ఇక ప్రభాస్ తెర పైకి వస్తే ప్రేక్షకులకు పూనకాలు వచ్చి పిచ్చెక్కిపోతారని ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం కూడా సరి కొత్తగా ఉంటుందని ఆమె వెల్లడించింది.

See also  Heros Marriage: వచ్చే నెల జూన్ లో ఇంతమంది హీరోల పెళ్లిళ్లు జరగనున్నాయా.? ఫ్యాన్స్ కు పండగే..

shriya-reddy-comments-on-prabhas-salar-movie

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ విడుదలవబోతున్న సలార్ చిత్రం ఈ సంవత్సరం సెప్టెంబర్ 28వ తారీకున ప్రపంచవ్యాప్తంగా విడుదల అవ్వబోతుంది. సెప్టెంబర్ 20వ తారీకు సలార్ కు సిద్ధంగా ఉండండి అంటూ ట్వీట్ చేసింది. ఇక ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించినుండగా జగపతిబాబు ఈశ్వరి రావు మొదలైన వారు కీలక పాత్రలు పోషించనున్నారు. ఇక ఈ చిత్రం ట్రైలర్ వచ్చే నెల ఒకటో తారీకున విడుదలబోతుంది. చూద్దాం మరి ట్రైలర్ విడుదలయ్యాక సలాడ్ చిత్రం గురించి అంచనాలు ఏ స్థాయిలో రెట్టింపు అవుతాయో ఎదురు చూడాలి మరి.