Home Cinema MegaStar Chiru: చిరంజీవి కెరీర్ లోనే తొలి సారి గా ఈ స్టార్ హీరోయిన్స్ తో...

MegaStar Chiru: చిరంజీవి కెరీర్ లోనే తొలి సారి గా ఈ స్టార్ హీరోయిన్స్ తో సినిమాలో నటించబోతున్నాడు. ఎవరెవరంటే..?

MegaStar Chiru: తెలుగు చిత్ర పరిశ్రమ లో మెగాస్టార్ చిరంజీవి కి అన్న మెగా ఫ్యామిలీ అన్న ఎలాంటి ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా కొనసాగుతున్న మెగా ఫ్యామిలీ ఎందరో హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తన దైన శైలిలో పలు చిత్రాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు దీటుగా ఇప్పటికీ హిట్స్ తో దూసుకుపోతున్నాడు చిరంజీవి. కానీ ఇటీవల విడుదలైన చిత్రం బోల్తా కొట్టడంతో ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో టఫ్ పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న ప్రతి చిత్రం కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతుండడంతో నెట్టింట హ్యూజ్ ట్రోలింగ్ కు కూడా గురవుతున్నాడు.

See also  Alia Bhatt: అలియా భట్ పబ్లిక్ లో రష్మిక తో అలాంటి బిహేవియర్ చేయడంతో హర్ట్ అయిన ఆ హీరో సమాధానం ఏమిటంటే..

Chiranjeevi 1

ఇక ఇందుకోసం చిరంజీవి తన దైన శైలిలో చిత్రాల ఎంపిక ఆచితూచి అడిగేస్తున్నాడు. సినిమాలు అనుకున్నంత స్థాయిలో విజయాన్ని లభించకపోవడమే కాకుండా డిజాస్టర్ గా మారుతున్నడంతో చిరంజీవి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. కాక ఇలాంటి తరుణంలో ఆయన ఎంతో ఇష్టంగా నటించబోతున్న ఓ సినిమాకి సంబంధించిన సమాచారమైతే ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మరి ఏంటా విషయం అది తెలుసుకుందాం.. కాగా ఇటీవలే చిరంజీవి జన్మదిన సందర్భంగా బింబిసార డైరెక్టర్ వశిష్ట తో మెగాస్టార్ చిరంజీవి ఓ చిత్రం చేయబోతున్నాడు అంటూ అనౌన్స్మెంట్ అయితే చేశాడు.

megastar-chiru-is-going-to-act-in-a-movie-with-this-star-heroine-for-the-first-time-in-his-career-who-is-1

అయితే ఈ చిత్రంలో హీరోయిన్లు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో మెగాస్టార్ మనందరిని ఆడి పాడి అలరించబోతున్నాడట. కాగా చిరంజీవి (MegaStar Chiru) తన జీవితంలోనే సినీ కెరియర్ లోనే మొట్ట మొదటి సారి ముగ్గురు హీరోయిన్లతో నటించబోతున్నారు. కాగా ఈ ముగ్గురు హీరోయిన్లు కూడా కేవలం టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు దక్కించుకున్న స్టార్ హీరోయిన్ కావడం గమనార్థం అందుకే ఈ కత్తిలాంటి ఫిగర్లను ఎంపిక చేసుకున్నాడు డైరెక్టర్ వశిష్ట. ఇందులో భాగంగా ప్రభాస్ సరసన బాహుబలి చిత్రంలో నటించి పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టిని మొదటి హీరోయిన్ గా ఎంపిక చేసుకోగా.. సీతారామమ్ చిత్రంతో మంచి సూపర్ హిట్ సాధించినటువంటి మృణాల్ ఠాకూర్ రెండవ హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు.

See also  Shobita Dhulipala: అక్కినేని ఇంటికి కోడలవ్వాలంటే సమంతలా శోభితకు అలాంటి కండీషన్ నాగార్జున పెట్టాడా.?

Chiranjeevi 2

ఇక మూడో హీరోయిన్ గా ఇటీవలే పొన్నియన్ సెల్వమ్ చిత్రంలో నటించి చాలా రోజుల తర్వాత వెండి తెర పై తళుకుమన్న సుందరి ఐశ్వరరాయ్ ని ఎంపిక చేసుకున్నాడట. కాగా అనుష్క శెట్టి, మృణాళ్ ఠాకూర్ ఇప్పటికే కన్ఫర్మేషన్ అయిపోయారంటూ మనకు తెలుస్తుంది. కాగా ఐశ్వర్య మాత్రం ఇంకా ఈ కథను చేయాల వద్ద అనే సందిగ్ధంలో ఉంటూ పెండింగ్ లో పెట్టిందట. కాగా ఈ చిత్రంలో ఐశ్వర్య పాత్ర మాత్రం ఈ సినిమాకి పెద్ద హైలెట్ గా నిలవబోతుందట. ఇక ఆమె జీవితంలోనే ఇప్పటి వరకు ఇలాంటి పాత్ర చేసి ఉండదని మేకర్ చెప్పుకున్నారు. ఐశ్వర్య ఒప్పుకుంటే మాత్రం ఆమె కెరియర్ లోనే ఈ మా ఇది మరొక పెద్ద బ్లాక్ బాస్టర్ గా నిలవబోతుందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.