Tarakaratna Funeral: 40 సంవత్సరాలు నిండకుండానే తారకరత్న మరణంతో ఇటు యావత్ ప్రపంచాన్ని అటు నందమూరి ఫ్యామిలీని పూర్తిగా కదిపించేసాయి. వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.. తారకరత్న మంచితనం గురించి ఆయన సన్నిహితులు అలాగే అభిమానులకు సైతం ఆయనెంటో తెలుసు. మంచితనానికి మారుపేరుగా గుర్తింపు పొందాడు. ఆయన దగ్గర వ్యక్తులు అయితే తమ కుటుంబ సభ్యులతో సమానంగా మమ్మల్ని చూసుకునేవాడని వెల్లడించగా ఆ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇకపోతే మొన్న తారకరత్న అంత్యక్రియలు జరిగిన విషయం అందరికీ తెలుసు. ఆ అంత్యక్రియలో (Tarakaratna Funeral) ఫిలిం ఛాంబర్ లో కొన్ని గంటల ముందు మతిస్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేసిన ఫోటోలు వీడియోలు కొన్ని బయటకు వచ్చాయి. ఆ వ్యక్తి బాలయ్య దగ్గరికి వెళ్లి బాలయ్య పైకి వేలెత్తి చూపుతూ హెచ్చరించడం జరిగింది. బాలయ్య కూడా ఆ మతిస్థిమితం లేని వ్యక్తి చెప్పిన మాటలు విని తల ఊపారట. ఇంతకు ఎవరు ఆ వ్యక్తి అని ఆరా తీయగా కొన్ని ఆసక్తి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఆ వ్యక్తి ఫిలింనగర్లో నివసిస్తాడని వార్తలు వినపడ్డాయి. ఆ మతిస్థిమితం లేని లేని వ్యక్తి ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ ఫిలింనగర్ చుట్టూ తిరుగుతుంటాడని.. అయితే అక్కడ ప్రజలు ఆయన మాటలు లెక్కచేయరని తెలిసింది. కాగా మరికొందరు మాత్రం వాళ్లతో దేవుడు ఏదో ఒక విషయంలో హెచ్చరించారని చెబుతున్నారు. ఏదేమైనాప్పటికీ దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేస్తే మంచిదనే విభిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. దేవుడే మతిస్థిమితం లేని ఆ వ్యక్తి రూపంలో వచ్చి బాలయ్యతో మాట్లాడాడేమో అని కొంతమంది అభిప్రాయం తెలుపుతున్నారు.
అయితే ఆ శివయ్య రకరకాల రూపాల్లో దర్శనమిస్తాడని, అందువల్లే తారకరత్న శివరాత్రి రోజు మరణించాడు కాబట్టే వారి కుటుంబాల్లో ఏదైనా కీడు ఉందేమోనని ఆ దేవుడు పిచ్చోడు రూపంలో వచ్చి బాలయ్యకు వేలెత్తి చూపిస్తూ హెచ్చరించాడేమో అని తెలుస్తుంది. ఇక పోతే బాలయ్య పిచ్చి వ్యక్తి నుంచి ఏమి విన్నారనే విషయం త్వరలో తెలియనుంది. ఏది ఏమైనా తన కుటుంబ విషయంలో జాగ్రత్తలు పడాలని అభిమానులు కోరుకుంటున్నారు