Home Cinema Rashmika: పంది మాంసం పై సంచలమైన కామెంట్స్ చేసిన రష్మిక మందన.

Rashmika: పంది మాంసం పై సంచలమైన కామెంట్స్ చేసిన రష్మిక మందన.

Rashmika Comments: అందరి హీరోయిన్ల కాకుండా రష్మిక మందనకు సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఎందుకంటే ఈమె ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా చలామణి అయ్యింది. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి తెలుగు చిత్ పరిశ్రమకు పరిచయమైన ఈ భామ ఇక్కడ స్టార్డమ్ సాధించడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే సౌత్ స్టార్ హీరోయిన్ జాబితాలోకి వెళ్లిపోవడమే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో చిత్రాలలో నటిస్తూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా కూడా మారిపోయింది. గీత గోవిందం తో మొదలైన తన సూపర్ హిట్ సినిమా ప్రయాణం,

rashmika-mandana-who-made-the-sarcastic-comments-on-pork

ఆ తర్వాత సరిలేరు నీకు ఎవరితో ఆగకుండా పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో రాణిస్తూ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలలో నటిస్తూ చాలా బిజీ బిజీగా ఉంది. అలా ఇండస్ట్రీ ఏది అనేది కాకుండా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్లలో వరుస సినిమాలలో నటిస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలలో మంచి జోరు మీద ఉన్న రష్మిక మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. వరుస సినిమాలలో నటిస్తూ మరో వైపు పలు కమర్షియల్ యాడ్స్ లలో కూడా నటిస్తుంది. ఇవే కాకుండా నెట్టింట వైరల్ అవుతున్న పలు విషయాల పై స్పందిస్తూ..

See also  Chiranjeevi - Pawan Kalyan : అసలు అలాంటి పని చేయొద్దని పవన్ ని చెడామడా వాయించిన చిరంజీవి!

rashmika-mandana-who-made-the-sarcastic-comments-on-pork

అప్పుడప్పుడు తెగ ట్రోల్ కి గురవుతుంది. సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సమయం కుదుర్చుకొని మరి అలా వెకేషన్స్ కి వెళ్లి సరదాగా గడుపుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఆమె మాట్లాడిన వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇటీవల ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా ఆమె ఆహార అలవాట్ల గురించి బహిర్గతం చేసింది. అందులో భాగంగా రష్మిక మాట్లాడుతూ తాను పంది మాంసాన్ని ఇష్టంగా తింటానని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నేను కూడా అలాంటి వంటకాలు తినే సాంప్రదాయం నుంచే వచ్చానని..

See also  Eagle: బాక్సాఫీస్ కలెక్షన్ల సునామీని సృష్టిస్తున్న మాస్ మహారాజా ఈగల్ మొదటి రోజు కలెక్షన్స్ ఎంతో తెలుసా.?

rashmika-mandana-who-made-the-sarcastic-comments-on-pork

ఆ సాంప్రదాయం ప్రకారమే పంది మాంసాన్ని కాల్చుకొని తింటానని వెల్లడించింది. పంది మాంసం తినడం మా సాంప్రదాయక వంటకం అని కూడా తెలిపింది. ఇక పంది మాంసం తిన్న తర్వాత ఘాడ నిద్ర వచ్చేందుకు మేము వైన్ తాగుతామని.. ఆ వైన్ కూడా స్వయంగా మా ఇంట్లోనే తయారు చేసుకుని తాగుతామని (Rashmika Comments) వెల్లడించింది. ఈ విషయం తెలుసుకున్న రష్మిక అభిమానులే కాక తెలుగు ప్రేక్షకులు సైతం నివ్వెరపోతున్నారు. రష్మిక చెప్పిన ఈ మాటలు ఆశ్చర్యానికి గురి చేస్తున్న అని వాపోతున్నారు. అదే కాకుండా రాత్రిపూట తిన్న తర్వాత వైన్ తాగితే చాలా మంచి నిద్ర వస్తుంది తెలియజేసింది. ఇక ఈ విషయాలన్నీ స్వయంగా రష్మిక చెప్పడంతో ప్రస్తుతం నెట్టింట ఈ విషయం జోరుగా వైరల్ అవుతుంది.