Home Cinema స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్న సమంత. అసలేం జరిగింది.?

స్టేజ్ పైనే కన్నీరు పెట్టుకున్న సమంత. అసలేం జరిగింది.?

దర్శకుడు గుణశేఖర్ అలా అనే సరికి స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న  సమంత అసలేమైంది.

మనందరికీ తెలిసిందే చాలా కాలంగా సమంత ఒక వ్యాధితో బాధపడుతుందని ఆ వ్యాధి పేరే వయోసైటిస్. ఈ వ్యాధి కారణంగా ఆమె ఇంట్లోనే ఉంటూ బయటకి రాకుండా మీడియాకు కనిపించకుండా ఉన్న సమంత “శాకుంతలం” సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో  భాగంగా ఆమె పాల్గొన్నారు. దర్శకుడు గుణశేఖర్ చెప్పిన మాటలకు ఆమె భావోద్వేగానికి లోన స్టేజి పైన అందరి ముందు ఏడ్చేసింది.

ఒక్కడు “సినిమా” వచ్చి 20 ఏళ్లు అయినా మీరు ఇంకా ఆదరిస్తున్నందుకు నా కృతజ్ఞతలు, మంచి కంటెంట్ ఉంటే మీరంతా ఏ చిత్రాలను అయినా తప్పకుండా ఆదరిస్తారు అని చెప్పడానికి ఉదాహరణనే ఈ సినిమా. ఈ సినిమా శాకుంతలంలో హీరోలు ముగ్గురు. కథకు హీరో దేవ్ మోహన్ మరో హీరో సమంత ఐతే మరొక హీరో తెర వెనుక ఉన్న హీరో దిల్ రాజు. శాకుంతలం సినిమా క్రెడిట్ మొత్తం మాత్రము దిల్ రాజు కే ఇస్తాను. ఈ సినిమా విషయంలో మీరు మాత్రం మాపై నమ్మకం ఉంచండి మీ నమ్మకం మాత్రం వమ్ము కానివ్వము. నేను అనుకున్న చిత్రాన్ని దిల్ రాజు గారు అండగా ఉండడం వల్లే శాకుంతలం సినిమాని తలకెక్కించగలిగాను. నా కుమార్తె భారత్ కి రాగానే నిర్మాతగా మారాలని అనుకుంది నన్ను వచ్చి కథలు అడగడం మొదలు పెట్టింది నేను పురాణాల్లో ఉన్న శాకుంతలం గురించి చెప్పాను. శాకుంతలం లాంటి పురాణాల గురించి ఇంకా ఎన్నో అద్భుతమైనవి ఇప్పటి వాళ్లకు తెలియచెయ్యాలని నీలిమ కోరింది, శకుంతలగా సమంత ఐతే పాత్రలో ఒదిగిపోతుంది అని చెప్పింది. వెంటనే సమంతను కలిసి ఈ శాకుంతలం గురించి చెప్పాను తనకు ఎంతో నచ్చేసింది ఈ కథ. తర్వాత దిల్ రాజు గారు ఇందులో భాగం అయ్యారు. ఒక హీరోయిన్ పై సమ్మకం ఉంచి ఇందులో ఇన్ని కోట్లు వెచ్చించారు, ధన్యవాదాలు.! అంటూ దర్శకుడు గుణశేఖర్ ఎమోషనల్ అయ్యే సరికి ఆయన మాటలతో అక్కడే ఉన్న సమంత కూడా ఏడ్చేసింది.

See also  Hyper Aadi: హైపర్ ఆదిని ఇరకాటంలో పెట్టిన పవన్ కళ్యాణ్.. పాపం ఆది పరిస్థితి?

 

నాకు బాగోలేకపోయినా వచ్చాను ఎన్నో రోజులుగా ఈ క్షణం కోసమే మేమంతాఎదురుచూస్తున్నాను. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఎలాగైనా పాల్గొనాలని నిర్ణయుంచుకుని  గుణశేఖర్ గారి పై ఉన్న గౌరవంతో వచ్చాను. నాకు ఓపిక లేకపోయినా బలాన్ని మొత్తం కూడబెట్టుకుని ఈ కార్యక్రమానికి హజరయ్యాను. ఇండస్ర్టీలో కొంతమందికి సినిమా ఒక భాగం.! కానీ గుణశేఖర్ కు మాత్రం సినిమానే ఓ జీవితం. ప్రతీ సినిమా ఆయన ప్రాణం పెట్టి తీస్తారు ఈ సినిమా అంతే అందుకే ఆ ప్రేమను, ప్రేమానురాగాలను మీ నుండి చూడాలని ఇక్కడకి వచ్చా. సాధారణంగా ప్రతీ సినిమాను ఎంతో కొంత అంచనా వేసుకుంటూ నటీనటులు ఊహించుకుంటారు, కొన్ని సార్లు ఊహను దాటి అంచనాలు తారుమారవుతుంటాయి. శాకుంతలం చూసాక నా అంచనాలు అలాగే అయ్యాయి. మా అందరికీ వెన్నుముకలా నిలిచిన దిల్ రాజు గారికి కృతజ్ఞతలు. ఇంతటి గొప్ప ప్రాజెక్ట్ లో భాగమవ్వడం నాకు చాలా సంతోషం. ప్రతీ సినిమాను నేను ఎంతో ప్రేమిస్తాను, ఆ సినిమా కూడా అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తుంది. ఈ సినిమాతో నా పై మీ ప్రేమ చాలా ఎదుగుతుందని నమ్మకం నాకుంది అంటూ సమంత తెలిపారు.

See also  Srikanth: ప్రాణభయంతో శ్రీకాంత్ అమెరికా పారిపోవడానికి ఆ సినిమా ఎలా కారణం అయ్యిందో మీకు తెలుసా?

ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా ఫిబ్రవరి 17న మన ముందుకు రానుంది. ఈ చిత్రం త్రీడీలో రూపోందిస్తున్నట్టు ఇప్పటికే చిత్రం యూనిట్ పేర్కోంది.