Home Cinema Venu Madhav: వేణు మాధవ్ మరణం గురించి సంచలన విషయాలు చెప్పిన తల్లి – 20...

Venu Madhav: వేణు మాధవ్ మరణం గురించి సంచలన విషయాలు చెప్పిన తల్లి – 20 కోట్లు ఉన్నప్పటికీ…!!

Venu Madhav: తెలుగు ఇండస్ర్టీలో ఎప్పటికీ గుర్తుండిపోయే కమెడియన్లలో వేణుమాధవ్ కూడా ఒకరు. ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన ప్రదర్శనతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వేణుమాధవ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన జీవితాన్ని ప్రారంభించిన వేణుమాధవ్ అతి తక్కువ సమయంలో స్టార్ కమెడియన్ గా ఎదిగారు. 2019లో ఆయన అనారోగ్యంతో మరణించారు.

venu-madhavs-mother-told-many-things-about-his-death

ఇటీవలే తాజాగా వేణుమాధవ్ తల్లి సావిత్రమ్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. వేణుమాధవ్ చనిపోయే సమయానికి దాదాపు 20 కోట్లకు పైగానే ఆస్తులు కూడాపెట్టారని అయినా తాను మాత్రం అద్దె ఇంట్లోనే ఉంటున్నానని అన్నారు సావిత్రమ్మ. సావిత్రమ్మకి ముగ్గురు కొడుకులు అందులో వేణుమాధవ్ చిన్నవాడు. చిన్నతనం నుంచే చాలా చురుగ్గా ఉంటూ మిమిక్రీలు చేసేవాడు. ఆ తర్వాత మంచి హాస్యనటుడిగా ఎదిగారు.

See also  Jailer first day collection : జైలర్ ఫస్ట్ డే కలెక్షన్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..

venu-madhavs-mother-told-many-things-about-his-death

తనను చూసి నేనెప్పుడూ గర్వపడేదాన్ని. నా ఇద్దరు కొడుకులని తనకు అసిస్టెంట్ గా పెట్టాను కానీ ఇప్పుడు ఎందుకు అలా చేశానని బాధపడుతున్నాను.వేణుమాధవ్ బాగానే ఎదిగినప్పటికీ వాళ్ళిద్దరు మాత్రమే ఎదగలేకపోయారు. మాధవ్ బ్రతికుంటే వాళ్లను చూసుకునే వాడేమో. కానీ తన చేతులతో తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు ఏ జబ్బు చేసినప్పటికీ టాబ్లెట్లు వేసుకుని అలవాటే లేదు. జాండీస్, డెంగ్యు వచ్చినా కూడా మందులను నిర్లక్ష్యం చేసేవాడు.

దాంతో ఆ పరిస్థితి విషమించి మరణించాడు. వేణుమాధవ్ చనిపోవడానికి నెలరోజుల ముందే నా పెద్ద కొడుకు కూడా చనిపోయాడు. ఇద్దరు కొడుకుల మరణంతో నేను కృంగిపోయాను అంటూ అన్నీరు పెట్టుకున్నారు. వేణుకి ఉన్న ఇద్దరు కొడుకులు వాళ్ళ స్వంత ఇంట్లోనే ఉంటున్నారు నేను మాత్రం మూడో కొడుకుని చూసుకుంటూ అద్దె ఇంట్లోనే ఉంటున్నానని చెప్పారు.