Home Cinema Guntur Karam: గుంటూరు కారం సినిమా షూటింగ్ ఆగిపోవడంతో మహేష్ బాబు అభిమానులు షాక్ లో...

Guntur Karam: గుంటూరు కారం సినిమా షూటింగ్ ఆగిపోవడంతో మహేష్ బాబు అభిమానులు షాక్ లో ఉన్నారు..

Guntur Karam: మహేష్ బాబుతో తెరకు ఎక్కిస్తున్న గుంటూరు కారం చిత్రం యొక్క డైరెక్టర్ గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఇక వీళ్ళు ఇద్దరు ఈ చిత్రం మొదలు పెట్టినప్పటి నుంచి ఇద్దరికీ ఏదో ఒక అడ్డంకి ఎదురు వస్తూనే ఉంది. అనుకున్న సమయానికి సెట్స్ పైకి వెళ్ళినట్లయితే ఈ చిత్రం ఎప్పుడో శరవేగంగా పూర్తి కూడా అయ్యేది. కానీ ఎవరి పనుల్లో వాళ్ళు ఇటు త్రివిక్రమ్ అటు మహేష్ బాబులు చాలా బిజీగా ఉండడంతో గుంటూరు కారం ప్రాజెక్టు చాలా లేట్ చేస్తూ వచ్చారు. ఇక ఈ చిత్రం ప్రారంభమై చాలా రోజులవుతున్నా కూడా సవ్యంగా షూటింగ్ మొదలవడం లేదు. మొదటి షెడ్యూల్ కొంతమేరకు పూర్తయినప్పటికీ కూడా సగం లోనే షూటింగ్ ఆపేశారని సమాచారం.

mahesh-babus-fans-are-in-shock-as-the-shooting-of-guntur-karam-movie-has-been-stopped

ఇదే కాకుండా మళ్లీ స్క్రిప్ట్ లో కూడా కొద్ది మొత్తంలో మార్పులు చేర్పులు చేయబోతున్నారట. కాగా మహేష్ బాబు త్రివిక్రమ్ ల మధ్య ఏవేవో బేధాభిప్రాయాలు వచ్చాయని అందువల్లే షూటింగ్ మధ్యలో ఆపేసి మహేష్ బాబు విదేశాలకు వెళ్లాడని ఓ ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. కాగా ఈ వార్తలని చిత్ర యూనిట్ మొత్తం ఖండించ సాగారు. గుంటూరు కారం చిత్రం యొక్క షూటింగ్ అనుకున్న సమయం ప్రకారం సాగడం లేదు.. దాంతో ఇందులో నటించే నటుల డేట్స్ కూడా ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. జూన్ 12 నుండి లేటెస్ట్ షెడ్యూల్ మొదలు పెట్టాల్సి ఉండగా ఆగిపోయిందట.. అందుకు అసలైన కారణం.. ఇతరులను డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం అంటూ వార్త ఇండస్ట్రీలో వినిపిస్తుంది.

See also  ఆ హీరోతో పెళ్లవ్వకుండానే తల్లవ్వాలని అనుకుంటుందట అనుష్క. మరి ఏ హీరోతోనో తెలుసా.?

mahesh-babus-fans-are-in-shock-as-the-shooting-of-guntur-karam-movie-has-been-stopped

ఇక ఇందులో మరీ ముఖ్యంగా ప్రకాష్ రాజ్ డేట్స్ చాలా తలనొప్పిగా మారిపోయిందట.. అందుకోసమే చేసేదేమీ లేక ఆయన కోసం మరో నాలుగు రోజులు పోస్ట్ పోన్ చేశారట. ఇక జూన్ 16 నుండి స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నారట. దీంతో గుంటూరు కారం చిత్రం విషయంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్న వేల అభిమానులు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఈ చిత్రంపై నెగెటివిటీ పెరిగేలా ఇలాంటి సంఘటనలు చేస్తున్నాయని వాపోతున్నా. దాదాపు 13 ఏళ్ల తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబోలో మరో అద్భుతమైన మూవీ సెట్ మీదకి వచ్చింది. కాగా గతంలో అతడు, ఖలేజా చిత్రాలు వీరి కాంబినేషన్లో తెరకెక్కగా.. హిట్ అనే సంబంధం లేకుండా ఈ చిత్రాలకు ఫ్యాన్ క్రేజ్ అయితే సంపాదించుకో గలిగాయి.

See also  Prabhas : నా కోడలిగా ఆ అమ్మాయే కావాలంటున్న ప్రభాస్ తల్లి.. అది జరిగే పనేనా?

mahesh-babus-fans-are-in-shock-as-the-shooting-of-guntur-karam-movie-has-been-stopped

ఇక ఈ చిత్రం (Guntur Karam) యొక్క ఫస్ట్ గ్లిమ్స్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా విడుదల చేయగా.. మహేష్ బాబు ఊర మాస్ అవతార్ ఫ్యాన్స్ ని ఫిదా చేసింది. ఇక నెట్టింట తెగ సందడి చేసింది చాలా రోజుల వరకు.. ఇక ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు వాళ్ళు పూజా హెగ్డే మరియు శ్రీ లీలా ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారు. ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2024వ సంవత్సరంలో విడుదల కారు ఉన్నది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు తమన్ సంగీతం అందించనున్నారు. గుంటూరు కారం చిత్రం కోసం మహేష్ బాబు అభిమానులు కాక తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ కాంబో త్రివిక్రమ్ మహేష్ బాబు మరియు పూజ హెగ్డే లతో ఎలాంటి సంచలన విజయాలు సాధించబోతుందో అన్నది సంక్రాంతి కానుకగా విడుదలైనప్పుడు మనకి తెలుస్తుంది.