Home Cinema Ketika Sharma: మెగా మెనల్లుళ్ళు సాయి ధరమ్ – వైష్ణవ్ తేజ్ లపై బోల్డ్ కామెంట్స్...

Ketika Sharma: మెగా మెనల్లుళ్ళు సాయి ధరమ్ – వైష్ణవ్ తేజ్ లపై బోల్డ్ కామెంట్స్ చేసిన కేతిక శర్మ..

Ketika Sharma: తెలుగు సినిమా రంగంలోకి రొమాంటిక్ చిత్రంతో పరిచయమైన అందాల ఆటం బాంబు కేతిక శర్మ. ప్రస్తుతం ఈ ఆటం బాంబు ఏకంగా మెగా మేనళ్ళుళ్ళు అయినటువంటి సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లపై బోల్డ్ కామెంట్స్ చేసింది. దాంతో ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అసలు విషయానికి వస్తే.. వైష్ణవ్ తేజ్,  కేతిక శర్మ తో కలిసి ఓ మూవీ చేసింది. అదే రంగా రంగా వైభవంగా.. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది గిరీశాయ కాగా ఈ చిత్రం గతే దాడి విడుదల అయింది. ఇక ఈ చిత్రం టాక్ పక్కన పెడితే స్క్రీన్ పై మాత్రం వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులకు మతి పోగొట్టి పిచ్చగా ఆకట్టుకున్నదనే చెప్పాలి.

See also  Amitabh Bachchan : క్రికెట్ పై అమితాబ్ అలాంటి ట్వీట్ చేయడానికి అసలు కారణం అదేనట..

ketika-sharma-bold-comments-on-mega-nephews

అలా తమ్ముడు తో సినిమా చేసిందో లేదో వెంటనే అన్న సాయి ధరమ్ తేజ్ తో కేతిక శర్మ కి ఆఫర్ వచ్చింది. ఇక ఇద్దరు జంటగా కలిసి నటిస్తున్న చిత్రం బ్రో. కాగా ఈ చిత్రం మెగా మల్టీస్టారర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా కీలకమైన పాత్ర పోషించానన్నాడు. ఇక ఈ చిత్రం తమిళంలో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన వినోదయ సీతంకు రీమేక్ గా మన తెలుగులో విడుదల అవ్వబోతుండగా పలు మార్పులు చేర్పులు చేసుకొని బ్రో గా అవతరించి మన ముందుకి ఈ నెల 28వ తారీఖున రాబోతుంది. ఐతే ఇక ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలో మనకు కనిపించబోతున్నాడు.

ketika-sharma-bold-comments-on-mega-nephews

ఇక ఈ చిత్రం సముద్రఖని దర్శకత్వం వహించగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ.జీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన చిత్రం బ్రో అంగరంగ వైభవంగా జులై 28వ తారీఖున విడుదల అవ్వబోతోంది. ఇక ఇటీవల ఈ చిత్రం యొక్క ప్రమోషన్ లో భాగంగా కేతిక శర్మ పలు ఇంటర్వ్యూల లో హాజరు కాగా బ్రో చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. అందులో భాగంగానే తాను సాయి ధరమ్ తేజ్ పోషిస్తున్న పాత్ర మార్క్ కి ప్రేయసిగా కనిపిస్తానని తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది (Ketika Sharma) కేతిక.

See also  Adipurush movie tickets : ఈ నంబర్ కలిస్తే ఆదిపురుష్ టికెట్ ఫ్రీ అంట!

ketika-sharma-bold-comments-on-mega-nephews

ఇక ఈ చిత్రం తనకు బాగా నచ్చిందని ప్రతి పాత్రలో కథని ముందుకు నడిపించేలా ఉండబోతుందని ఆమె తెలియజేసింది. ఇదే క్రమంలో సదరు యాంకర్ సాయి ధరమ్ తేజ్ – వైష్ణవ తేజ్ ల గురించి చెప్పమని అడగ్గా.. మెగా మేనళ్ళుళ్ళ పై పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ముందుగా సాయి ధరమ్ తేజ్ గురించి చెప్పగా అందరితో చాలా త్వరగా ఇట్టే కలిసిపోతూ అందరితో జోకులేస్తుంటాడు, అందరితో కలవడంలో సాయి ధరమ్ తేజ్ తో పోలిస్తే వైష్ణవ తేజ్ చాలా వెనుకబడి వీక్ గా ఉంటాడు. ఎందుకంటే అతనికి మొహమాటం చాలా ఎక్కువ కానీ బాగా దగ్గరైతే మాత్రం చనువు పెరిగాక ఎంతో సరదాగా ఉంటుంటాడు. అలాగే అన్నదమ్ములు ఇద్దరు చాలా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులు అంటూ కేతిక చెప్పకు రాగా.. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట వైరల్ గా మారాయి.