Sharwanand: టాలీవుడ్ లోని హీరోలలో శర్వానంద్ మోస్ట్ ఎలిగిబుల్ బ్యాచిలర్ లో ఒకరు అయితే మొత్తానికి ఓ ఇంటివాడు కాబోతున్నాడు.
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న అమ్మాయితో త్వరలో ఏడడుగులు వేయబోతున్నాడు.
అయితే శర్వానంద్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు జోరుగా వినిపించినప్పటికీ మొదట్లో అమ్మాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని ఆ తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లాడపోతున్నాడని మొత్తానికి ఐతే అమ్మాయి పూర్తి వివరాలు బయటకు వచ్చాయి.
శర్వానంద్ పెళ్లాడబోయే అమ్మాయి పేరు రక్షిత రెడ్డి.
ఆమె ప్రముఖ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కూతురు అంతేగాక చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలుని సమాచారం. రక్షిత తండ్రి గారైన మధుసూదన్ రెడ్డి సోదరుడు గంగారెడ్డి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అల్లుడు ఆ విధంగా రక్షిత రెడ్డికి గోపాలకృష్ణారెడ్డి మనవరాలు అయిందట. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు శ్రీకాళహస్తి నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. త్వరలోనే శర్వానంద్ రక్షిత రెడ్డి వివాహం జరగబోతుంది ఈ నెల 26వ తారీకు లో హైదరాబాద్ లోనే నిశ్చితార్థం జరిగింది శర్వానంద్ తన సోషల్ మీడియా ద్వారా ఎంగేజ్మెంట్ ఫోటోలను పంచుకున్నాడు.
అయితే ఇటీవలే అన్ స్టాపబుల్ షోలో బాలయ్య అడిగిన పెళ్ళి ప్రశ్నలపై శర్వానంద్ ప్రభాస్ తర్వాత అని చెప్పినప్పటికీ
ప్రభాస్ చేసుకునేంత వరకు ఆగకుండా అందరికీ ఎంగెజ్మెంట్ తో సప్రైజ్ చేసాడు. చూడాలి మరి పెళ్ళి ఏ రోజు జరగబోతుందో.
ఐతే ఈ ఎంగెజ్మెంట్ కి, రామ్ చరణ్ ఉపాసన దంపతులు హజరయ్యారు. మొత్తానికి శర్వానంద్ బ్యాచిలర్ జీవితం ఇంతటితో ముగియనుంది.
ముందుగా పెళ్ళి రోజులు శుభాకాంక్షలు తెలుపుదాం మనమంతా.