నందమూరి వారసుడు తారకరత్న గత కొన్ని రోజులుగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేసుకుంటున్న విషయం మనందరికి తెలిసినదే. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి నందమూరి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తూ, ఆయన క్షేమంగా ఆరోగ్యంగా బయటకి రావాలని కోరుకుంటున్నారు. అటు నందమూరి మరియు నారా వారి కుటుంబాలు తారకరత్న చికిత్స పై శ్రద్ధ పెట్టి, అవసరమైన వైద్యం ఆయనకు అందేలా చూస్తున్నారు.
తారకరత్న సినిమా రంగంలో నిలబడాలని ట్రై చేశారు గాని, ఆయనకి సక్సెస్ కనబడలేదు. అయినప్పటికి అభిమానులకు మాత్రం ఆయన గుర్తు ఉన్నారు. నందమూరి వారసులలో ఎవరినైనా… నందమూరి అభిమానులు అంతగా అభిమానిస్తూ ఉంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో తారకరత్న సంబందించిన న్యూస్ లు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం పై వైద్యులు అప్డేట్ ఇస్తున్నా కూడా… ఏవేవో లేనిపోని వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
సినిమా రంగం తారకరత్న కి అంతగా కలిసిరాకపోయినా, ఆయన రాజకీయాలలో నిలబడతారని అందరూ అనుకున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో… తారకరత్న పాల్గున్నారు. కొంచెం దూరం వెళ్లిన తరవాత ఆయన కుప్పకూలిపోయారు. అంతే అక్కడ నుంచి ఆయన ఇంత వరకు ఇంటికి చేరలేదు. తాజాగా వస్తున్న వార్తలు ప్రకారం, ఆయన బ్రెయిన్ కి మెరుగైన ట్రీట్మెంట్ చేయించడానికి విదేశాలకు తీసుకుని వెళ్తున్నారట.
ఇప్పటి వరకు హాస్పిటల్ ఖర్చులన్నీ నారా వారే ఇస్తున్నారంట. అయినా కూడా లోకేష్ గురించి వెళ్లడం వలెనే, తారకరత్న కు ఇలా జరిగిందని కొందరు వాపోతున్నారు. నిజానికి తారకరత్న కు అలా జరిగిన దగ్గర నుంచి చంద్రబాబు, లోకేష్ ఇప్పటికి కోటి రూపాయలు ఖర్చు పెట్టారంట. ఇంకా విదేశాలకు పంపాలని అనుకుంటున్నారు. తారకరత్న దురదృష్టవశాత్తు జరిగిన దానిలో లోకేష్ చేసిన పాపం ఏముంది?.