Home Cinema Anchor Anasuya: మళ్ళీ తల్లయిన అనసూయ – నెట్టింట ఫోటోలు వైరల్

Anchor Anasuya: మళ్ళీ తల్లయిన అనసూయ – నెట్టింట ఫోటోలు వైరల్

Anchor Anasuya: న్యూస్ రీడర్ గా తన జీవితం మొదలు పెట్టి ఆ తర్వాత బుల్లి తెరపై యాంకర్ గా మంచి సక్సెస్ అయ్యి ప్రస్తుతం వెండి తెరపై తలుక్కుమంటుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతానికి మాత్రం అనసూయ మళ్ళీ తల్లి అయినట్టు, గర్భవతిగా ఉన్న కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి. ఇటు పక్క ఫాన్స్ తో పాటు అటు పక్క జనాలు కూడా కంగు తింటూ కామెంట్స్ పెడుతున్నారు. అదేమిటి తనకు స్కూల్ కి వెళ్ళే పిల్లలున్నారు ఇప్పుడు తల్లవ్వడం ఏంటనుకుంటున్నారా. మీరు విన్న మాటలు నిజమే కానీ నిజానికి తను తల్లి అయ్యింది తాజాగా నటిస్తున్న ఓ సినిమాలో మాత్రమే.

See also  Ileana: ఆ తప్పు వల్లే సౌత్ ఇండస్ట్రీ ఇలియానా ను బ్యాన్ చేసిందా..??

ఆమె నటిస్తున్న తాజా చిత్రంలో గర్బవతిగా పాత్ర చేయనున్నది. దానికి సంబందించిన లుక్ తనే రివిల్ చేసింది. అది కాస్తా వైరల్ అవ్వడంతో సోషల్ మీడియా అంతటా రచ్చ రచ్చ నడుస్తుంది. కృష్ణవంశీ దర్శకత్వం లో తెరకెక్కనున్న మరాఠీ సూపర్ హిట్ నట సామ్రాట్ రీమేక్ చిత్రమే ఈ రంగామార్తండ. ప్రాధాన పాత్రల్లో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ నటించనున్నారు. వాయిదాల మీద వాయిదాలతో షూటింగ్ పనులు సాగుతున్నా ఇప్పటికే చాలా ఆలస్యం అవుతున్నది.

See also  Upasana : తల్లి అయ్యాక తన భర్త రామ్ చరణ్ నిజస్వరూపం తెలుసుకుని అలాంటి నిర్ణయం తీసుకున్న ఉపాసన!

తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో స్వయంగా అనసూయ పోస్ట్ చెయ్యడం తో వైరల్ అయ్యింది ఈ విషయం. ఇంకా ఈ సినిమా కీలక రోల్స్ లో శివాత్మిక రాజశేఖర్, బ్రాహ్మనందం, అనసూయ నటించనున్నారు. చాలా కాలంగా వినిపిస్తున్న వార్త ఈ చిత్రంలో అనసూయ ఓ దేవదాసిగా కనిపిస్తుందనే కధలు వినిపించాయి. కానీ అనసూయ పాత్రకు ఆ పుకార్లకు సంబంధమే లేకుండా పొయ్యింది. కింద ఉన్న ఫోటోలో శివాత్మిక పెళ్లి కూతురుగా ప్రకాష్ రాజ్ మరియు రమ్యకృష్ణ తల్లి దండ్రులుగా అదే ఫోటోలో గర్భవతిగా అనసూయ కూడా కనిపించింది. సందీప్ కిషన్ పాన్ ఇండియా మూవీ మైఖేల్ లో అనసూయ కీలక పాత్ర పోషించానుందట.