
Virupaksha: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత చేసిన సినిమా విరూపాక్ష.సాయిధరమ్ తేజ్ కి జరిగిన యాక్సిడెంట్ వల్ల అతను మళ్ళీ తేరుకుంటాడో లేదో బ్రతుకుతాడో లేదో అనే భయం నుంచి బయటికి వచ్చి.. తాను సినిమాలోకి బ్యాక్ వచ్చి చేసిన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ చేశాడు. విరూపాక్ష ( That star heroine missed the Virupaksha ) సినిమాని ఇప్పట్లో సినీ అభిమానులు మర్చిపోలేరు. సాయిధరమ్ తేజ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్గా, కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో రూపొందిన విరూపాక్ష సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో బ్రహ్మాజీ, సాయి చంద్ , సోనియా సింగ్, అజయ్, సునీల్ , రాజీవ్ కనకాల మొదలగు వాళ్ళు నటించడం జరిగింది.
ఈ సినిమాని సుకుమార్ శిష్యుడు దర్శకత్వం వహించగా.. ఈ సినిమాకి కథని సుకుమార్ అందించడం జరిగింది. అందుకే ఈ సినిమాలో లాజిక్స్ ని పట్టుకోగలడం కష్టమైంది. చివరికి ఏం జరుగుతుంది సినిమాలో విలన్ ఎవరు ( That star heroine missed the Virupaksha ) అనేది ఆరా తీయడానికి మైండ్ కి పని చెప్పాల్సి వచ్చింది. హర్రర్ సినిమాలో ఇంత చక్కగా లాజిక్ ని ఎవరు కనిపెట్టకుండా ఉండేలా తీసి సినిమా లో ఊహించనీ ట్విస్ట్ పెట్టిన సుకుమార్ కథ అదరగొట్టింది. ఇక దర్శకుడు కూడా ఈ సినిమాని ఎంతో చక్కగా చిత్రీకరించడం జరిగింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచి కలెక్షన్ లు అదరగొట్టింది.
ఈ సినిమాలో అన్నిటికంటే గ్రేట్ పాయింట్ ఏంటంటే.. చివరి వరకు ఒక రకమైన ఆశక్తిని ,అనుమానాన్ని పెట్టి.. ఎవరూ ఊహించని వ్యక్తిని హీరోయిన్ ని విలన్ గా పెట్టడం అనేది మామూలు విషయం కాదు. అయితే ఈ సినిమాతో సంయుక్త మీనన్ కి చాలా మంచి నేమ్ వచ్చింది. ఈ సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ్ ( That star heroine missed the Virupaksha ) అయినప్పటికీ.. ఎక్కువ పాయింట్స్ మాత్రం హీరోయిన్ సంయుక్త మీనన్ కొట్టేసింది. ఇటువంటి బ్లాక్ బస్టర్ సినిమాలో అవకాశం దొరకడం నిజంగా ఆమె అదృష్టం. ఆమె నటన, ఆమెలో ఉన్న ప్రతిభని చూపించుకోగలిగే అవకాశం దొరికింది. అలాగే ఈ సినిమా మొదట సంయుక్త మీనన్ ని అనుకోలేదంట. ఇంతకీ మొదట ఏ హీరోయిన్ ని అనుకున్నారో తెలుసుకుందాం.
ఈ సినిమాలో మొదట హీరో ఈ హీరోయిన్ పాత్రకి సాయి పల్లవి అనుకున్నారంట. ఆమె అయితే బాగా కుదురుతుందని అనుకున్నారంట. కానీ తర్వాత దర్శకుడు ఆలోచించాడంట.. సాయి పల్లవి నటనా ప్రతిభ అందరికీ తెలిసిందే. ఆమెకు ఏ పాత్ర ఇచ్చిన అందులో మునిగిపోతుంది. ఇక ఆ పాత్రని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందర్నీ డామినేట్ చేసుకొని మరి ముందుకెళ్ళిపోతాది. ఇలాంటి తరుణంలో ఇంత మంచి పాత్రని సాయి పల్లవి గాని ఇస్తే ఇంకా సినిమాలో హీరోగాని మిగిలిన వాళ్ళు ఎవరో కనిపించరని అందుకని అందరిని డామినేట్ చేసే అవకాశం ఉందని.. సాయి పల్లవి ని హీరోయిన్ గా పెట్టుకోలేదంట. ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ.. పాపం సాయిపల్లవిలో ఉండే ఈ టాలెంట్ వలన ఇంత బ్లాక్ బస్టర్ మూవీని మిస్ అయిపోయిందా అని నెటిజనులు బాధపడుతున్నారు.